CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రతిభావంతురాలైన విద్యార్థినికి దక్కిన ప్రోత్సాహకం

Share it:

 


[మేధా ఛత్రవతిరి యోజన ఇండియన్ ఆయిల్ సంస్థ ద్వారా ఇచ్చిన మెరిట్ సర్టిఫికేట్ మరియు మెరిట్ స్కాలర్షిప్ చెక్]

మన్యం మీడియా ప్రతినిధి/ అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మేధా ఛత్రవతిరి యోజన ఇండియన్ ఆయిల్ సంస్థ వారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని, పదవ తరగతిలో ప్రతిభ చూపించిన తల్లిదండ్రులు లేని విద్యార్థులను గుర్తించి ప్రోత్సాహకంగా మెరిట్ స్కాలర్ షిప్ ను పై చదువుల నిమిత్తం సచింద్రా బెహ్ర ద్వారా అందజేయనున్నారు. అందులో భాగంగా ములకలపల్లి మండలం, రామచంద్రపురం గ్రామానికి చెందిన కస్తూర్బా పాఠశాల విద్యార్థిని జుబ్బూరు విజేత కు పదివేల రూపాయల మెరిట్ స్కాలర్షిప్ చెక్కు మరియు మెరిట్ సర్టిఫికేట్ ను ఎంపీపీ సున్నం లలిత, జెడ్పిటిసి భారత లావణ్య, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ పి కవిత, చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణ, ఉప సర్పంచ్ పర్సా వెంకటేశ్వరరావు, ఎస్ఎంసి వైస్ చైర్మన్, పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొని విద్యార్థిని అభినందించారు.

Share it:

Post A Comment: