గుండాల ఆగస్ట్ 18 (మన్యం మనుగడ) మండల కేంద్రంలో తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి ఏటా ఆదివాసి లంబాడీలు ఆగస్టు నెలలో తీజ్ వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సాంప్రదాయాల మధ్య డప్పు వాయిద్యాలతో భారీ ఊరేగింపు నిర్వహించి స్థానిక ఊర చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో పురుషులు, మహిళలు, పిల్లలు, పెద్ద మొత్తంలో పాల్గొన్నారు
Post A Comment: