👉 20, లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ప్రోత్సాహక బహుమతి.
మన్యం టీవీ : ములకలపల్లి మండలం;
ఆగస్టు 15 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ములకలపల్లి మండలం లోని వీకే రామవరం గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా అధికారులు ఎంపిక చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ సునీల్ దత్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, 20 లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతిని గ్రామ పంచాయతీ సర్పంచ్ కుంజ భాస్కర్, గ్రామ పంచాయితీ కార్యదర్శి రవీందర్, అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎండిఓ చిన నాగేశ్వరరావు,పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని,ఇంకా భాద్యతో పని చేస్తానని ఈ సందర్బంగా వారు తెలియజేసారు,
Post A Comment: