మన్యం మనుగడ, భద్రాచలం:
తెలంగాణ జాగృతి భద్రాచలం మండలం ,మరియు భద్రాద్రి మహిళా మండలి తరుపున ఈరోజు అనగా ఆదివారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్ధ లతో తో బోనాలు సమర్పించడం జరిగింది. కరోనా మహమ్మారి ఉండటం వలన ఘనంగా చేయవలసిన బోనాలు అతి కొద్దిమందితో నిర్వహించడం జరిగింది దుర్గమ్మ తల్లి ఈ కరోనా మహమ్మారి నుండి మనలన్ని,మన ఊరిని ,మన రాష్ట్రాన్ని ,మన దేశాన్ని ,ఈ ప్రపంచాన్ని కాపాడాలని మనసారా వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ నండూరి అనురాధ భద్రాచలం మండల కన్వీనర్ పద్మ ప్రియ,అనురాధ,పద్మావతి, లక్ష్మితదితరులు పాల్గొన్నరు.
Post A Comment: