CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పలు సమస్యలుపై మంత్రి ఎర్రబెల్లి కి వినితి పత్రం అందించిన ఎంపీటీసీ భారతి

Share it:





 మన్యంటీవీ, అశ్వారావుపేట: 

అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం పంచాయితి పరిధిలోని ఫామాయిల్ నర్సరీ ని సందర్శించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ సేక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డిని కలసిన అశ్వారావుపేటకాంగ్రెస్  ఎంపీటీసీ -1 వేముల భారతి. అశ్వారావుపేట అభివృద్ధి పరంగా వెనకబడి వున్నా కనీసం పారిశుద్ధ్యం వైపు కూడా పంచాయితీలకు నిధులు ప్రభుత్వం కేటాయించిన నిధుల దుర్వినియోగం పై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ముఖ్యం గా మండల పరిషత్ ఎంపీపీ చొరవతో సర్పంచులకు సైతం స్వేచ్ఛ స్వాతంత్య్రాలు కోల్పోయి వారి పెత్తనాలతో పంచాయితీలకు మొక్కలను తక్కువ ధరలకు కొని అధిక ధరలతో బిల్లుల సేకరణను చేస్తూ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని పత్రికలు కతలు కతలుగా వ్రాస్తున్న ఎవ్వరు పట్టించుకొనే పరిస్థితులు లేవని ఆమె లేఖనం ద్వారా తెలియజేసారు. నియోజక వర్గమైన   అశ్వారావుపేటమేజర్ పంచాయితీ పారిశుద్యం పై ప్రత్యేక శ్రద్ద వహించి ప్రత్యేక నిధులను కేటాయించి అభివృద్ధి కి తోడ్పడాలని అవినీతికి తావులేకుండా మండల పరిషత్ పంచాయితీ అధికారులకు సూచనలు తెలియజేయాలని ఆమె తెలిపారు. ఎంపీడీఓ విజయ పై అవినీతి ఆరోపణల వెనుక అసలు కధానాయకుల కధ వేరే వుంది వారినిసైతం నిగ్గతీయ్యాల్సిన అవసరం ఉందని అభ్యర్ధించారు.

Share it:

TELANGANA

Post A Comment: