న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి మాచర్ల సత్యం
గుండాల జూలై 31 (మన్యం మనుగడ) లింగన్న ఆశయాలను సాధిస్తామని న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి మాచర్ల సత్యం అన్నారు. శనివారం మండల మండల కేంద్రంలో లింగన్న రెండవ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోళ్ల గడ్డ గ్రామ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో జూలై 31న అశువులు బాశారు అన్నారు. లింగన్న ఆశయాలను కొనసాగించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తామని ఆయన అన్నారు. పీడిత ప్రజల కోసం లింగన్న తన ప్రాణాన్ని అంకితమిచ్చారు అని ఆయన కొనియాడారు. లింగన్న స్ఫూర్తితో పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకరన్న , కొమరం శాంతయ్య , వెంకటేశ్వర్లు , బుర్ర వెంకన్న , ఈ సం కృష్ణ , ఎనుగంటి గణేష్ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: