CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపు ఇచ్చిన ఆదివాసీ సంక్షేమ పరిషత్...

Share it:

 


మన్యం టీవీ : జూలూరుపాడు,

ఆగస్టు 7, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం లో శనివారం ఏర్పాటుచేసిన ఆదివాసీ సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు తెల్లం నరసింహారావు దొర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆదివాసి ప్రజలందరూ ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆదివాసి గ్రామాలలో, ఆదివాసీ గూడేలలో, ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజు జెండాను ఎగుర వేయ్యాలని కోరారు. ఆదివాసి గ్రామాలలో ఒక పండుగ లా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. మన ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రతిబింబించేలా నాయకులు, పెద్దలు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, అందరూ సహకరించాలని కోరారు. అదే రోజు మండల కేంద్రాలలో కూడా జెండా ఆవిష్కరణ చేపట్టాలని తెలిపారు. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాడు వైరా నియోజకవర్గం లోనీ ఏన్కూరు మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ సంబురాలను అంబరాన్ని అంటే విధంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో మూడు మండలాల ఆదివాసిలంతా కలిసి ఘనంగా ఆదివాసి దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కావున ఆదివాసీ మిత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరై మన ఉనికిని, మన శక్తిని, చాటిచెప్పలని ప్రకటన ద్వారా కోరారు.

Share it:

Post A Comment: