మన్యం టీవీ కొత్తగూడెం, ఆగస్టు 8:-
ఆగస్టు 9వ తేదీ సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రజల ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు డీఆర్వో అశోక చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించుటకు జిల్లా కలెక్టర్ అనుదీప్, అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10.30 గంటల నుండి అందుబాటులో ఉంటారని ప్రజలు సమస్య పరిష్కారానికి నేరుగా కలెక్టర్ అనుదీప్ ని కలిసి పరిష్కరించ
బడేందుకు దరఖాస్తు చేయుటకు రావాలని ఆయన తెలిపారు.
Post A Comment: