ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జయప్రదం చేయండి 👉తుడుందెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆలెం కోటి
మన్యం మనుగడ, పినపాక:
ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి అల్లెం కోటి మాట్లాడుతూ ...ఈ బయ్యారం క్రాస్ రోడ్డులో సమావేశం జిల్లా సీనియర్ నాయకులు మడకం సత్యలింగం అధ్యక్షతన నిర్వహించారు. అలెం కోటి మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని అధికారికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు .అలాగే తెలంగాణ రాష్ట్ర శ్రీ ముఖ్యమంత్రివర్యులు కె .చంద్రశేఖర రావు దళితులకు దళిత బంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎలా ఇస్తున్నారో, ఆదివాసులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు ఆదివాసులకు ఆర్థిక బంధు పథకం పేరా ఇంటికి పది లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసి దినోత్సవం రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని పేర్కొన్నారు. ఆదివాసి ఉద్యోగస్తులు ,ప్రజలు విద్యార్థులు ,మేధావులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలు ఆగస్టు -9న ఐక్యతను చాటుతూ తమ ఇళ్ళ మీద జెండాలను ఎగర వేసుకొని ,గూడెం లో గ్రామ ఆదివాసి పెద్దలతో పచ్చ జెండా ఎగర వేసుకొని ,అలాగే ఉదయం 10 గంటలకు బైక్ ర్యాలీ ద్వారా కరకగూడెం మండల కేంద్రం నుండి కొమరం భీమ్ దాదాకు విగ్రహానికి నివాళులర్పించి, ఇ. బయ్యారం క్రాస్ రోడ్ వద్ద కొమరం భీమ్ దాదాకు విగ్రహానికి నివాళులు అర్పించి, మణుగూరు మండల కేంద్రంలో కొమరం భీం విగ్రహం వద్ద నివాళులర్పించి ఆదివాసి చట్టాలపై ,హక్కులకోసం భవిష్యత్ కార్యాచరణ పై సమావేశం నిర్వహించబడుతున్నది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల అధ్యక్షులు గోగుల నారాయణ ఎం .రామారావు యు .గణేష్ కె. వెంకటేష్ ,సుక్కయ్య ఎస్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: