భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 20, (మన్యం మీడియా)
సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 84 జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులను ఎక్స్టర్నల్ అభ్యర్థుల చే భర్తీ చేయడం కోసం ఈనెల 29వ తేదీన కొత్తగూడెం మరియు పాల్వంచ పట్టణాలలోని 18 పరీక్షా కేంద్రాలలో ఉదయం 10.30 గంటల నుండి 12.30 గంటల వరకు వ్రాత పరీక్ష నిర్వహించబడునని, ఈ వ్రాత పరీక్షకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 11133మంది అభ్యర్థులకు కాల్ లెటర్స్ జారీ చేయడం జరిగిందని, మరియు SMS ద్వారా అలర్ట్ చేయడమైనదని, ఈ వ్రాత పరీక్షలో అభ్యర్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ లేదా అవకతవకలకు పాల్పడకుండా నివారించేందుకు అత్యాధునికమైన రాపిస్కాన్స్ మరియు మెటల్ డిటెక్టర్స్ తో కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఉద్యోగ నియామకాలలో అభ్యర్థులు దళారులను నమ్మిమోసపోవద్దని,అభ్యర్థులను ఎవరైన దళారులు మోసగిస్తే అట్టివారి ఆధారాలను సింగరేణి యాజమాన్య దృష్టికి తెలియజేస్తే అట్టివారిపై కఠిన చర్యలు తీసుకుంటారని A ఆనందరావు GM పర్సనల్ RC, IR&PM తెలియ జేశారు.
Post A Comment: