మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని రాజుపేట హరిజన వాడ జి పి స్కూల్ లో నర్సయ్య సార్ ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలబాలికలు గ్రామ ప్రజలు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జి పి స్కూల్ అధ్యాపకులు నర్సయ్య సార్ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశం యావత్ భక్తి శ్రద్దలతో జరుపుకోవటం చాలా ఆనందం కలుగజేస్తున్న కానీ మన భారత దేశంలో ప్రపంచంలో ఏ దేశానికీ లేనటువంటి సహజ వనరులు మనకు ఉన్నాయి, ఉరకలు వేసే యువత ఉన్నారు అయినా కూడా మన దేశం ఇంకా అభివృద్ధి సాధించలేకపోతున్నది అంటే ముమ్మాటికీ ఇది యువత నిర్లక్ష్యం మాత్రమే యువత చదువుల్లో రాణించాలి, చదువు అనేది ఒక ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగం కోసమే అని భావించకుండా మీకు నచ్చిన రంగాల్లో ప్రతి ఒక్కరూ స్థిరపడి మీరు ఆర్ధికంగా బలపడినపుడు మీరు, మీకుటుంబం, ఇలా ప్రతి ఒక్కరు అభివృద్ధి సాధిస్తే దేశం అభివృద్ధి పదంలోకి దూసుక పోతుంది. అందుకే యువత అన్నిరంగాల్లో రాణించాలి దేశానికీ దిశా నిర్దేశం చేయాలి దేశం అంటే మట్టికాదోయ్ దేశం అంటే మనుసులోయ్ అన్న గురజాడ మాటల్లోని అర్ధం ఇదేఅంటూ చదువు యొక్క ప్రాముఖ్యత, మీరందరు బాగా చదివి ప్రయోజకులు కావాలంటూనర్సయ్య సార్ బాలబాలికలకు మంచి సూచనలు చేసారు.తధానంతరం బాల బాలికలకు చాకొలేట్, బిస్కెట్స్ పంచారు.కార్యక్రమం లో జి పి ఎస్ పరిదిలోని బాలబాలికలు, పెద్దలుకర్రీ చిన్నపుల్లయ్య, వెంకన్న, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, అంగన్వాడీ వర్కర్ సకీనా, జి పి ఎస్ వర్కర్ రమణకొప్పుల తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: