CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Share it:

 



జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ 1947వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన మన దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు అని,బ్రిటిష్ వారిపై పోరాటంలో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలకు ప్రతిఫలం దక్కిన మధురమైన రోజు అని,అప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీన మనము స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము అని అన్నారు.మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం అని,అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిప్రతిష్టలు పెంపొందేలా చెయ్యడం మన బాధ్యత అని గుర్తుచేశారు.ప్రజలు అందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు,ఎంపీపీ కారం విజయకుమారి,వైస్ ఎంపీపీ కె.వి.రావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని.బాబురావు,ఎంపీటీసీలు,బాబురావు,సమ్మక్క,సరిత,రమ్య,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ లు బచ్చల భారతి,బొగ్గం రజిత,కొమరం జంపేశ్వరి, కారం.ముత్తయ్య,ఉప సర్పంచ్లు,పుచ్చకాయల శంకర్,మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, టౌన్ అధ్యక్షుడు అడపా అప్పారావు,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, పినపాక నియోజకవర్గ మీడియా ఇంఛార్జి యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,టౌన్ యువజన అధ్యక్షులు రుద్రవెంకట్,టిఆర్ఎస్,నాయకులు,మహిళ,కార్యకర్తలు,యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: