మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో 75 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఏటూరు నాగారం తెరాస మండల పార్టీ అధ్యక్షుడు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పి కోఆప్షన్ సభ్యులు వలీయాబి సలీం, ఎంపీపీ విజయ నాగరాజు, పిఎసిఎస్ చైర్మన్ కూనురు అశోక్ గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి సర్దార్ పాషా, సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,ఎంపీటీసీలు,వార్డు మెంబర్లు,సహకార సంఘ డైరెక్టర్లు,మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు,యువజన సంఘం నాయకులు గ్రామ పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: