మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణలు..
ఆదివారం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఎం పార్టీ అఫిసు,మరియు సీఐటీయూ,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,రైతుసంఘం, ఐద్వా, కేవిపిఎస్, ఆవాజ్ సంఘాల అధ్వర్యంలో ఇల్లందు లోని వార్డులు,పంచాయితీ ల పరిధిలో మువ్వన్నెల జెండాలు ఆవిష్కరణలు చేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేసినానంతరం నాయకులు అబ్దుల్ నబి,దేవులపల్లి యా,తాళ్లూరి కృష్ణ,మన్యం మోహనరావు, ఆలేటి సంధ్య,జైబున్నిసా,మరియా,నాగరాజు,మహమూద్,లు మాట్లాడుతూ నాడు తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి స్వాతంత్ర సంగ్రామం చేసి స్వతంత్రం సాధించుకున్నామని,ఇపుడు నల్ల దొరల పాలన నుండి ఈ దేశాన్ని కాపాడుకోవల్సిన అవసరం ఉన్నదన్నారు.రైతు,కార్మిక వ్యతిరేక,మతోన్మాద విధానాలు అవలంబిస్తున్న పాలకులను గద్దె దింపడానికి మరో క్విట్ ఇండియా ఉద్యమం కొనసాగుతున్నదని అన్నారు.ఈకార్యక్రమంలో సోమలక్ష్మీ,యాకమ్మా,వెంకటమ్మ,రాందాస్,లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: