వాజేడు మండలం మురుమూరు గ్రామపంచాయతీలో 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమం లో సర్పంచ్ పూసం నరేష్ కుమార్ మాట్లాడుతూ మనకు స్వతంత్రం రావడం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేయడం వల్లనే మనం ఈ రోజు ఈ స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నాము వారి స్ఫూర్తితో మనం కూడా భవిష్యత్తు తరాలకు మంచి ఫలాలను అందించాలని, వారి మార్గాలలో నడవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గౌరారపు కోటేశ్వరరావు, వార్డు సభ్యులు, బోదెబోయిన మోహన్ రావు,మోడెం నాగమణి శ్యామల దమయంతి,పంచాయతీ కార్యదర్శి చిడెం నరేష్ బాబు కొఆప్షన్ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశ,అంగన్వాడీలు, గ్రామ పెద్దలు, స్కూల్ టీచర్స్, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: