మన్యం టీవీ, అశ్వాపురం:తెలంగాణ సిద్ధాంతకర్త,ఉద్యమ స్పూర్తిప్రదాత,ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముత్తినేని సుజాత అధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జయశంకర్ చిత్రపటానికి పూలామాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీరబాబు,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,ఎంపీవో శ్రీనివాసరావు, యూ డి సి ప్రవల్లిక, ఏ ఈ చక్రదరాచారి,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: