👉మృతుడువెంకన్న కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారం చెల్లించాలి
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు
మణుగూరు ఓ సి-2 లో ప్రమాదవశాత్తు చనిపోయిన బొలెరో డ్రైవర్ కామ్రేడ్ వేల్పుల.వెంకన్న సంతాప సభ శనివారం స్నేహ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగింది.సీపీఐఎంఎల్ ఉపాధ్యక్షులు కామ్రేడ్ మధుసూదన్ రెడ్డి సభలో పాల్గొని మాట్లాడుతు ఓ సి-2 లో మరణించిన బొలెరో డ్రైవర్ వేల్పుల.వెంకన్న కు కోటి రూపాయల నష్టపరిహా రం ఇవ్వాలని,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రీజన్ అధ్యక్షుడు కామ్రేడ్ సంజీవ్, కన్వీనియన్స్ వెహికల్ యూనియన్ అధ్యక్షుడు కామ్రేడ్ జేల్లా.అశోక్,ఎండీ. గౌస్,మున్సిపల్ రాష్ట్ర నాయకుకు కామ్రేడ్ భత్తుల. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: