టిబిజికేయస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు* ---------------------------------------- మణుగూరు సింగరేణి ఏరియా ఓసి 2 నందు మొదటి షిఫ్ట్ లో దురదృష్టవశాత్తు బోలెరో వాహనం పై డంపర్ దూసుకవేళ్లడం వల్ల జరిగిన ప్రమాదం లో ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న టిబిజికేయస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల. కవిత గారు తీవ్ర దిగ్ర్భాంతి బాధను వ్యక్తం చేస్తూ మృతులకు సంతాపం వ్యక్త పరిచారు..వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ప్రమాదం జరిగిన తీరు తెన్నులను టిబిజికేయస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు గారు, ప్రధాన కార్యదర్శి మిర్యాల.రాజిరెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్య సాధనలో సింగరేణి యాజమాన్యం తీసుకుంటున్న రక్షణ చర్యలు మరింత మెరుగుపరచవలసిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు..రానున్న కాలంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సింగరేణి యాజమాన్యం పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.సింగరేణి నందు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న కార్మికులు విధి నిర్వహణ లో మృతి చెందిన వార్త ఎంతో కలచి వేసిందని బాధను వ్యక్త పరిచారు .మృతుల కుటుంబాలకు టిబిజికేయస్* *అండగా నిలుస్తుందని తెలిపారు..ప్రమాద ఘటన ను* *గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్* *గారి దృష్టికి తీసుకెళ్లి మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తూ మెరుగైన ఆర్ధిక ప్రయోజనం,ఉపాధి అందించే విషయంలో టిబిజికేయస్ అండగా నిలుస్తుందని తెలిపారు*.
Post A Comment: