*చనిపోయిన కుటుంబాలకి 3 ఉద్యోగాలు,కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
*దొంగతనంగా పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న దానికి నిరసనగా ఆసుపత్రి ఎదుట ధర్నా: కూనం నేని. సాంబశివరావు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి కాలరీస్ లో జరిగిన ఈ సంఘటన దురదుష్టకరమని ఓ సి-2 లొ ప్రమాదం ఏ విధంగా జరిగిందో దీనిపై విచారణ వెంటనే చేపట్టాలని,దోషుల ను కఠినంగా శిక్షించాలని, దొంగతనంగా పోస్ట్ మార్టం కు ఎలా తరలిస్తారు అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కునంనేనీ. సాంబశివరావు,సీపీఐ జిల్లా కార్యదర్శి.ఎస్కె.సాబేర్ పాషా నాయకత్వం లో సింగరేణి కాలరీస్ హాస్పిటల్ ఎదుట ఆందోళన నిర్వహించారు.సింగరేణి అధికారుల అరాచకత్వం మానుకోవాలని సూచించారు.చనిపోయిన కుటుంబాలకి కుటుంబానికి 1ఉద్యోగం,కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో సీపీఐ జిల్లా, మండల,ఏ.ఐ.టి.యూ.సి నాయకులు సారెడ్డి. పుల్లారెడ్డి,ఆర్.లక్ష్మినారాయణ,ఎస్కె.సర్వర్,అక్కి.నర్సింహారావు,వై.రాంగోపాల్,బి.వీరాస్వామి,తోట.రమేష్,భీమరాజు,క్రిష్ణ,యోహన్,పారాలమల్లయ్య,వీరమాల్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: