మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 10, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ 11 న జరుగు కలక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయ్యలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి ఎదులాపురం గోపాలరావు కోరారు. మంగళవారం గుండెపుడి గ్రామంలో జరిగిన సమావేశంలో గోపాలరావు మాట్లాడుతూ..
ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, బిర్సాముండా, గోదావరి పరులేకర్, రాంజీగోండు, కోటన్న, బాటన్న, లింగన్న ల స్ఫూర్తి తో ఆదివాసీ గిరిజనులు, పేదలు, సాగు చేసుకుంటున్న భూములు రక్షణకై ఆగస్టు 9 న కొమరారం నుండి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆద్వర్యంలో ఆగస్టు 9న ప్రారంభమైన పాదయాత్ర ఆగస్టు 11న కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం కు చేరుకుని, ధర్నా కార్యక్రమం జరగుతుందన్నారు. పోడుభూముల కు పట్టాలు, 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, యస్సి, ఎస్టి, లకు 3 ఎకరముల భూమి ఇవ్వాలని,పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయ్యలని జరిగే దర్నా కార్యక్రమం లో ప్రజలు అదిక సంఖ్య లో పాల్గోని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పివైయల్ జిల్లా నాయకులు రాయల సిద్దు,ఎఐకెయంయస్ మండల నాయకులు బత్తుల గోపాలరావు,పివైయల్ మండల నాయకులు కుంచం జమలయ్య, ఓర్సు శ్రీను,పిఓడబ్లు మండల నాయకులు బత్తుల కళమ్మ,రమణ,కోటమ్మ,రమాదేవి,నాగరాజు,శంకరయ్య,నాగేశ్వరరావు తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: