చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
108 వాహనంలో కవలలు జన్మించిన సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చండ్రుగొండ మండలం బెండల పాడు గ్రామ శివారులోని గుత్తి కోయల గ్రామానికి చెందిన మటకం సంజు అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్సు సమాచారం అందించారు. 108 సిబ్బంది గుత్తికోయలు గ్రామానికి చేరుకొని ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రికి వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యంలో పురిటి నొప్పులు ఎక్కువ రావడంతో ఈ ఎన్ టి తిరుపతి, పైలెట్ అనిల్ కుమార్ అంబులెన్స్ లో సంజు పండంటి కవల పిల్లలు( ఆడ-మగ ) పిల్లలు జన్మించారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. వీరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. 108 వాహన సిబ్బంది ని అధికారులు ప్రజా ప్రతినిధులు అభినందించారు
Post A Comment: