మన్యం టీవీ : ఇల్లందు
మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామపంచాయతీ లింగగిరి గ్రామంలో జోగ రామనాథంకు ఆదివాసీ హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు వారి ఆధ్వర్యంలో 10.000/- పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. జోగా రామనాథం గారు గత సంవత్సర కాలంగా గొంతు క్యాన్సర్ బాధపడుతున్నారు. వారి పరిస్థితి విషమించడంతో వారికి వైద్య చికిత్స అందవలసిన అవసరం ఉన్నది. జోగరామనాథం సుగుణ దంపతుల నేపథ్యం రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం భూమి లేని నిరుపేదలు కావడంతో వైద్య చికిత్స కోసం డబ్బుల్లేక ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు వారు రామనాథం కు మెరుగైన చికిత్స కోసం ఆదివాసి ఉపాధ్యాయులు, ఉద్యోగులు సహకారంతో విరాళాలు సేకరించి పదివేలు జోగ రామనాథం కుటుంబానికి అందజేశారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి జోగ రామనాథం కు సహాయం చేయాలని ఆదివాసి హెల్ప్ లైన్ సెంటర్ ఇల్లందు వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: