CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సెప్టెంబర్ 1 నుంచి ‘మాదిగల మేలుకొలుపు యాత్ర’

Share it:

 


బీజేపీ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా, మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల మేలుకొలుపు యాత్ర నిర్వహిస్తామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈరోజు ఆయన మాట్లాడారు.

ఈ యాత్ర సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు నాలుగు విడతలుగా 100 నియోజకవర్గాలలో కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో ఈ యాత్ర ప్రారంభమై.. తుంగతుర్తిలో ముగింపు సభ ఉంటుందన్నారు. ఈ సభలలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఆయన వివరించారు.

2014లో మారిన జనాభా లెక్కల ప్రకారం జనాభా దామాషా ప్రకారం మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల జాగృతి రథ యాత్ర చేశినట్టు ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాలకు రిజర్వేషన్ లు ఇచ్చేలా సుప్రీం కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉందని, ఆ తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తామన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: