*జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బంది తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మలేరియా నివారణ చర్యలు తీసుకోవాలి.
*జిల్లాలో విజ్రభిస్తున్న మలేరియా.
*గ్రామాలలో మలేరియా టెస్ట్ లు చేయాలి.
*వైద్య సిబ్బంది గ్రామాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించాలి.
*కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి తో పోరాడుతున్న ప్రజలకు ఇప్పుడు మలేరియా జబ్బు వలన పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని ములుగు జిల్లా లో మలేరియా తీవ్రత వలన ప్రాణాలు కోల్పోతున్నారని యుద్ద ప్రాతిపదికన మారు మూల గ్రామాలలో,గుండెలలో, తండాలలో వైద్య సిబ్బంది పర్యటించి హెల్త్ క్యాంప్ లు నిర్వహించాలని, గ్రామాలలో దోమల బెడుద లేకుండా మలేరియా మందులు పిచికారి చేయాలని పేద ప్రజల ప్రాణాలను కాపాడలాని వైద్య సిబ్బంది కి సూచించారు.
వెంటనే జిల్లా కలెక్టర్ వైద్య సిబ్బంది తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మలేరియా నివారణ కు చర్యలు తీసుకోవాలని సీతక్క అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,మాజీ సహకార సంఘం చైర్మన్ వేముల సమ్మీ రెడ్డిఎంపీటీసీ మవురపూ తిరుపతి రెడ్డి,జిల్లా నాయకులు పిన్ రెడ్డి రాజీ రెడ్డి,జిల్లా నాయకులు ముశిన పెల్లి కుమార్ గౌడ్,కిసాన్ సెల్ జిల్లాకార్యదర్శిచక్రపురాజు,తదితరలు పాల్గొన్నారు.
Post A Comment: