మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఈ-గ్రంధాలయంలో వస్తు సామాగ్రి కొరకు 15 లక్షల రూపాయల నిధులు మంజూరు కేరట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు పినపాక శాసనసభ్యులు రేగాకాంత రావు తెలిపారు . మణుగూరు పట్టణంలోని వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు, విద్యావంతులకు కు డిజిటల్ లైబ్రరీ ఎంతో ప్రయోజనకరం గా ఉండనుందని ఆయన అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ కి గత కొన్ని రోజుల క్రితం వినతి పత్రం అందజేయ్యడం జరిగిందని, తక్షణమే స్పందిస్తూ DMF నిధుల నుంచి కేటాయించడం జరిగిందన్నారు. నిధులు మంజూరు చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , జిల్లా కలెక్టర్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: