CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా మూడవ దశ పై మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:కరోనా మూడవ దశ దృష్ట్యా అశ్వాపురం మండల  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి మణికంఠారెడ్డి, తహసిల్దార్ సురేష్ కుమార్, సీ ఐ సట్ల రాజు మండల ప్రజలకు సూచించారు. కరోనా థర్డ్ వేవ్ పై తహసిల్దార్ కార్యాలయంలో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో థర్డ్ వేవ్ లో  గ్రామీణ ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నిబంధనలు పాటించాలని  ప్రజలు మాస్క్ లు ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని విందులు, వినోదాలు కు  ప్రజలు దూరంగా ఉండాలన్నారు. వర్షాకాలం కాబట్టి ఇండ్ల ఆవరణ, ఇండ్ల చుట్టూ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. నీరు నిల్వ ఉంటే లార్వాలు ఏర్పడి దోమలు పెరిగి డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. మండల ప్రజలు జాగ్రత్తలు పాటించి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలన్నారు.

Share it:

Post A Comment: