మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ దమ్మపేట మండలంలో MLA మెచ్చా నాగేశ్వరరావు స్వగృహంలో మండల ప్రధానకార్యదర్శి దొడ్డా రమేష్ తో కలిసి పార్టీ విద్యార్థి విభాగం(TRSV) భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సుంకుబావన అనుదీప్ గారు,నియోజకవర్గ అధ్యక్షులు వెంపాటి భరత్ కుమార్ , మరియు వేముల హరీశ్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భ గా ఎమ్మెల్యే మేచ్చా నాగేశ్వర్ రావు గారు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను విద్యార్థి సంఘాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని,విద్యార్థులు రాజకీయాలలో చురుకుగా పాల్గొనాలని కోరారు.అన్ని వేళలా విద్యార్థులకు అందుబాటులో ఉంటానని,ఎమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.జిల్లా, నియోజకవర్గ అధ్యక్షుల అధ్వర్యంలో అన్ని మండలాలలో నూతన కమిటీలు ఏర్పాటు చేయమని సూచించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థి నాయకులు వేములపల్లి హరీష్ కుమార్,గొంట్రూ కృష్ణ రెడ్డి నాగరాజు,పర్వతనేని వంశీ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post A Comment: