CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రగతి లో పాల్గొన్న సర్పంచ్ బడిశ

Share it:

 



మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జానంపేట గ్రామపంచాయతీ సర్పంచ్ బాడిస మహేష్ పల్లె ప్రగతి పనుల్లో చాలా చలాకీగా పాల్గొంటున్నారు. పదిరజుల

 ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు నియమించిన ప్రణాళిక ప్రకారం పనులను చేస్తున్నారు. కరోనా సోకిన వారి గృహాలకు వెళ్లి ,బ్లీచింగ్ చల్లించడం, శానిటైజ్ చేయించడం లాంటి పనులను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం, అవెన్యూ ప్లాంటేషన్ ను చేపిస్తున్నారు.నీటి గుంతలు మురికి గుంతలు గల ప్రాంతాలలో జెసిబి సహాయంతో మట్టిని తరలించి గుంతలను పూడ్చి వేసి, రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే పనులు చేస్తున్నారు . శనివారం రోజున పల్లె ప్రగతి లో భాగంగా ఈ కార్యక్రమాలను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, ప్రత్యేకాధికారి రామారావు, కారోబార్ నరసింహారావు, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: