మన్యం టీవీ కొత్తగూడెం, జులై 7:- బుధవారం నాడు మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మూడో దశ పట్టణ ప్రగతి లో భాగంగా ఆరో వార్డు లో పర్యటించడం జరిగింది.
6వ వార్డు సభ్యులతో మరియు ప్రజాప్రతినిధులతో వార్డు మొత్తం పర్యటించి, వార్డులో ఏవెన్యూ ప్లాంటేషన్ కొరకు రోడ్లు ఇరువైపులా ఫిట్టింగ్ యంత్రం తెపించడం జరిగింది.
మరియు నెహ్రూ బస్తి నందు నివాసం ఉంటున్న ఎస్కే మహమ్మద్ తండ్రి పేరు జానీ, గత మూడు సంవత్సరాల కింద రోడ్డు ప్రమాదంలో తన కాలు ప్యాక్చర్ అయింది, ఆపరేషన్ చేయడానికి అతనికి గుండెకు సంబంధించిన వ్యాధి వల్ల ఆపరేషన్ చేయలేదు, కావునా అతను మంచానికి పరిమితం అవ్వడం జరిగింది.ఈ సందర్భంగా చైర్ పర్సన్ వార్డ్ విజిట్ లో ఉన్నప్పుడు తన సమస్య చెప్పుకొని బాధపడుతూ చైర్ పర్సన్ కి వీల్చైర్ కావాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
తన బాధను నేరుగా చూసినా చైర్ పర్సన్ తక్షణమే ఒక వీల్ చైర్ తెచ్చి తనకు ఇవ్వడం జరిగినది దీని అనంతరం మొహమ్మద్ మరియు వారి కుటుంబ సభ్యులు చైర్ పర్సన్ కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఈ యొక్క పర్యటనలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్,టీబీజీకేఎస్ 11మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, టిపిఒ ప్రభాకర్, సత్యనారాయణ, షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: