గుండాల జూలై 31 (మన్యం మనుగడ) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా కార్యదర్శి లింగన్న మూడో వర్ధంతి ని మండలంలో నిర్వహించారు. 3 సంవత్సరాల క్రితం జూలై 31న ఎన్కౌంటర్లో లింగన్న రోళ్ల గడ్డ గ్రామ సమీపంలో గల గుట్ట వద్ద మృతి చెందాడు. ప్రతి ఏటా జులై 31న వర్ధంతిని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గుండాల, కాచన పల్లి, జగ్గు తండ, కొడవటంచ, తదితర గ్రామాల్లో వర్ధంతి కార్యక్రమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో పి వై ఎస్ నాయకులు రవి, ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ సీతారాములు, మాజీ సర్పంచ్ శాంతయ్య, వై వెంకన్న, అరెం నరేష్ , ఈ సం కృష్ణ , అట్టి కం శేఖర్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: