గుండాల జూలై 13 (మన్యం మనుగడ) కరోనా మృతుడికి అంతక్రియలు నిర్వహించిన రెవిన్యూ మరియు పంచాయతీ సిబ్బంది. మండలం పరిధిలోని సాయన్న పల్లి గ్రామంలో కరోనాతో తాటి పెద్ద లక్ష్మయ్య 80 మృతి చెందగా అతడి అంత్యక్రియలను నిర్వహించేందుకు గుండాల రెవిన్యూ సిబ్బంది మరియు సాయన పెళ్లి పంచాయతీ సిబ్బంది శవాన్ని ట్రాక్టర్లో ఎక్కించుకుని జెసిబి సహాయంతో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది ఆర్ ఐ నాగేశ్వరరావు, పంచాయతీ సర్పంచ్ లక్ష్మీ నర్సు , టిఆర్ఎస్ నాయకులు తేలం భాస్కర్, మాజీ ఎంపీటీసీ బచ్చల రామయ్య , వీఆర్ఏ శివాజీ , మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Post A Comment: