మన్యం టీవీ మణుగూరు:
రోటరీ క్లబ్ ఆఫ్ కోల్ ఫీల్డ్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్స్ డే ను ఘనంగా నిర్వహించారు.ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో వైద్యుల సేవలు మరువలేనివని రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆకుల. మల్లిఖార్జునరావు అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా మణుగూరు ప్రభుత్వ వైద్యులు డాక్టర్. వెంకటేశ్వర్లు,మౌనిక లను ఘనంగా సన్మానించారు. వైద్యుల సేవలకు గుర్తుగా డాక్టర్స్ డే ను చేసుకోవడం గర్వించదగిన విషయమని రోటరీ క్లబ్ ట్రైనీ యూసఫ్ అన్నారు.ఈకార్యక్రమంలో కార్యదర్శి సందా మధు, సభ్యులు ఎం.వెంకట్, జె.వి.ఎస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: