👉 ప్రమాదాలకు నెలవైన కూసి కుంట.
👉 సంవత్సర కాలంలో ఇది నాలుగో మరణం.
👉 ప్రమాదాలకు కారణం అక్రమ మట్టి తోలకంతో ఏర్పడ్డ క్వారీలే అంటున్న గ్రామస్తులు.
మన్యం టీవీ : జూలూరుపాడు,
జూలై 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు గ్రామ శివారు కూసి కుంట చెరువులో పడి కొత్తూరు గ్రామానికి చెందిన బూరం వరప్రసాద్ (23) అనే యువకుడు మృతి చెందాడు. మండలంలో గత మూడు రోజుల నుండి కురుస్తున్నా వర్షాలకు చెరువులో చేపలు పట్టడానికి ఆదివారం తన సోదరుడు,మిత్రులతో కలిసి చేపల వేటకు వెళ్లారు వర ప్రసాద్ చేపలు పడుతూ ఈత కొడదామని చెరువులోకి దూకాడు, అక్కడ సుమారు 30 అడుగుల లోతైన క్వారీ ఉండడంతో వరప్రసాద్ మునిగి చనిపోయాడు. వరప్రసాద్ తో వచ్చిన తన సోదరుడు,మిత్రులు, చెరువులోకి దూకిన వ్యక్తి బయటకు రాకపోవడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఎస్సై శ్రీకాంత్, మరియు సిబ్బంది, చేరుకొని పాపకొల్లు,కొత్తూరు, గ్రామంలోనీ ఈతగాల్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారుగా మూడు గంటలు శ్రమించి ఈతగాళ్లు గాలింపు చేయగా వరప్రసాద్ మృతదేహం లభ్యమైంది.ఈ కూసి కుంట చెరువు ప్రాంతం అంతా లోతైన క్వారీల తో ప్రమాదాలకు అడ్డాగా మారింది. గత సంవత్సర కాలంలో ఈ చెరువులో ప్రమాదవశాత్తు పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, మరియు ఒక మహిళ మృతి చెందారు. ఈ ప్రమాదాలు అన్నింటికీ కారణం ఈ చెరువు మట్టిని జెసిబి ల సహాయంతో అతి లోతైన క్వారీలను తీయడం వలన వర్షాకాలంలో అవి నిండి ఆ ప్రాంత అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తరచు ప్రమాదాలకు నెలవుగా మారిన కూసి కుంట చెరువు ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇన్ని ప్రమాదాలకు కారణమవుతున్న అక్రమ మట్టి తవ్వకాలను పూర్తిగా నిలిపివేయాలని సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు. యువకుడు చెరువు లో పడిన విషయం గ్రామస్థులకు తెలియగానే చెరువు దగ్గరకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొన్నారు. పోలీస్ కేసు నమోదు దర్యాప్తు.
Post A Comment: