మన్యం మనుగడ,భూర్గంపాడ్:
అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మోరంపల్లి బంజర్ గ్రామంలో ప్రాథమిక వైద్య కేంద్రంలోని వైద్యురాలు స్పందనను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఐకార్ సభ్యులు, మాజీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు భూక్యా సీతారాంనాయక్, యడ్లపల్లి శ్రీనివాస్ కుమార్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మోకాళ్ళ నాగస్రవంతి, మాజీ ఎంపీటీసీ వై వెంకటేశ్వర్లు నాయుడు, పాల్వంచ పట్టణ అధ్యక్షులు మానుపురి ప్రభాకర్, మండల ప్రధాన కార్యదర్శి సాయిశ్రీను, జిల్లా సంఘటన మంత్రి శ్రీనివాసచారి, భూక్య వెంకట్ నాయక్, బానోతు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: