మంగపేట తహసీల్దార్ బాబ్జి ప్రసాద్
మన్యం టీవీ మంగపేట.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు
మంగపేట మండలం తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ మంగపేట మండలం ప్రజలను ఉద్దేశిస్తూ భారీ వర్షాల దృష్ట్యా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు
చెరువులు పొంగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరూ చేపల వేటకు వెళ్ళకూడదని సూచిస్తున్నాము
చెరువులు పొంగుతున్నపుడు వాగులు, రోడ్లు దాటకూడదు
కూలటానికి సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఎవరూ ఉండకుండా చూసుకోవాలి. రెవెన్యూ, పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇస్తే రక్షిత ప్రదేశంలో ఉంచగలుగుతాము
నిరంతరం వర్షం ఉంటుంది కాబట్టి విద్యుత్ వలన షాక్ లు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి
గర్భిణీ స్త్రీ లు ఇబ్బంది పడకుండా డెలివరీకి సిద్ధం గా ఉంటే పి హెచ్ సి కి పంపించాలి
ఇక ఏ ప్రమాద సంఘటనలు జరగకుండా చూసుకునేలా మీ సహకారం కావాలని కోరుకుంటూ
వరదనీరు వల్ల ప్రమాదకర విష పురుగులు, పాములు సంచరించే ప్రదేశాల్లో సంచరించకూడదు
తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ ఒక ప్రకటనలో పత్రికాముఖంగా ప్రజలని ఉద్దేశించి పలు సూచనలు చేసారు
Post A Comment: