ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు
గుండాల జూన్ 30 ( మన్యం టీవీ) దళిత సాధికారిత పథకమును స్వాగతిస్తున్నామని దళిత సంఘాల నాయకులు అన్నారు. దళితుల కోసం ఈ పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు అని వారు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో విలేకర్ల సమావేశంలో దళిత సంఘాల నాయకులు షెడ్యూలు కులాల పోరాట సమితి మండల నాయకులు బొమ్మెర సత్యం మాట్లాడుతూ. దళితుల కోసం 10 లక్షల రూపాయలతో ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దళితులు వెనుకబాటుతనం గానే ఉన్నారన్నారు వారి కోసం ఈ పథకం ప్రవేశపెట్టడం హర్షనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొమ్మెర నగేష్ ,దుర్గం లక్ష్మీనారాయణ, గాంధీ ర్ల రాజారత్నం, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: