ప్రజా సంఘాల
ఆధ్వర్యంలో దోమెడ అంగన్వాడీ భవనం పరిశీలన
మన్యం టీవీ మంగపేట
మంగపేట మండలం లోని దోమెడ గ్రామంలో కట్టినటువంటి అంగన్వాడీ భవనం అప్పుడే శిదిలావస్థకు చేరుకున్న తరుణంలో ప్రజా సంఘాలు ఎస్ ఎఫ్ ఐ తోకల రవి నాయకత్వంలో శిదిలావస్థకు చేరిన భవనాన్ని సందర్శించి చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి అంగన్వాడీ భవనంలో కూడా పైసలకు కక్కుర్తిపడి భవన నిర్మాణం లో నాణ్యత లేని విధంగా నిర్మించి నిర్మాణం పూర్తి అయిన కొంత కాలానికే శిదిలావస్థకు చేరడం అంటే ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది.
ఎస్ ఎఫ్ ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు తోకల రవి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమేడ అంగనవాడి భవనం 20,00,000 రూపాయలు అయ్యింది భవనానికి మధ్యలో నెర్ర బాసింది లేకుండా నాణ్యతలేని కట్టుబడులు కడుతున్నారు నామమాత్రపు కట్టుబడుల ద్వార నష్టం వాటిల్లుతుంది
అదేవిధంగా ప్రభుత్వ అధికారులు స్పందించి జరిగే అన్యాయాల పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మరియు కాంట్రాక్టర్ యాజమాన్యం కుమ్మక్కై గ్రామ ప్రజలకు నష్టం కలిగే పనులు చేస్తున్నారని వారు వాపోయారు పనులు ప్రారంభించిన అప్పటినుండి యాజమాన్యం ఇప్పటి వరకు పర్యవేక్షణ చేయలేదు ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ యొక్క కాంట్రాక్టర్ ను యాజమాన్యం పై చర్యలు తీసుకొని గ్రామ ప్రజలు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల ప్రజా సంఘాల
ఎస్ ఎఫ్ ఐ ,టీ ఏ జి ఎస్ ,డి వై ఎఫ్ ఐ,ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపడతామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు నరేష్ ,గంగా ప్రసాద్, ప్రసాద్ ,సందీప్ , రఘు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: