గుండాల జూలై 30 (మన్యం మనుగడ) గిరిజన పల్లెల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించి పలువురికి ఉచితంగా పరీక్షలు మరియు మందులను అందజేశారు. ముతాపురం గ్రామంలో నాబార్డ్ ట్రైబల్ డెవలప్మెంట్ కమిటీ జాగృతి ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంపు ను నిర్వహించారు. అందులో భాగంగా గ్రామంలో ఉన్న కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. డ్రై డే ఫ్రైడే సందర్భంగా గ్రామంలో ఉన్న వీధులన్నీ పరిశీలించి పాత టైర్లలో మరియు నీరు నిలిచే ప్రదేశాలను పరిశీలించి శుభ్రపరచుకోవాలి అని గ్రామస్తులకు సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా ప్రోటోకాల్ పాటించాలని వారు కోరారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని శానిటైజర్ వాడాలని తప్పకుండా అరగంటకో సారి చేతులు కడుక్కో వాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, ముతాపురం సర్పంచ్ సమ్మయ్య , వైద్యుడు రవి చంద్, సి హెచ్ ఓ శ్రీహరి, ఏఎన్ఎం భువనేశ్వరి, డి టి ఎఫ్ కోఆర్డినేటర్ ఆనంద్, ఇంజనీర్ వీరన్న, రామనాథం, గుండాల ఉపసర్పంచ్ మానాల ఉపేందర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు గ్రామంలో
Post A Comment: