విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కరెంటు స్తంభాల ఏర్పాటు
పాల్గొన్న ఎంపీపీ మంజు భార్గవి
గుండాల /ఆళ్ల పల్లి జూలై 5 (మన్యం టీవీ) ఆళ్ల పల్లి మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మధ్య మధ్యలో కరెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు. అనంతరం ఏ డి ఈ ఓకే నాయక్ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరాయం విద్యుత్ సరఫరా చేసేందుకు సిబ్బంది ఎల్లవేళల అందుబాటులో ఉంటామన్నారు. ప్రజలకు నాణ్యమైన కరెంటును అందించడమే మా లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. మధ్య మధ్య స్తంభాలను ఏర్పాటు చేయటం వలన విద్యుత్ వైర్లు క్రిందకు వేలాడకుండా ఉంటాయన్నారు. ప్రజలు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి హనుమంతు , ఎంపీపీ మంజు భార్గవి , ఏ డి ఈ రాంబాబు , సర్పంచ్ కోటేశ్వరరావు , ఏ ఈ రవి , గ్రామస్తులు ఆఫీస్ , ఖయ్యుం , హతహర్ , విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: