CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వృద్ధురాలు కు ములుగు జడ్పీ చైర్ పర్సన్ కుసుమ జగదీష్ ఆర్థిక సహాయం

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని 

బూటారం గ్రామానికి చెందిన పంజాల వీరలక్ష్మి ఇటీవల మృతి చెందగా వారి దశదిన కర్మ కు హాజరై కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. అలాగే ఇదే గ్రామంలో ఇరుప బాబు తల్లి రామక్క ఆరోగ్య విషయాన్ని సోయం సత్యమ్మ, కమల ఇరువురు మహిళలు రామక్క ఆరోగ్య పరిస్థితిని జడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన చైర్మన్ రామక్క ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితి చూసి చలించిపోయి వెనువెంటనే ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా రామక్క ఆరోగ్యం బాగోగుల బాధ్యతను సత్యమ్మ కమలకు అప్పజెప్పారు. ఏమైనా అవసరం ఉంటే నన్ను సంప్రదించమని ఈ ఇరువురు మహిళలకు తెలిపారు. రామక్క మాట్లాడుతూ నా కొడుకు బతుకుతెరువు కోసం వలస వెళ్ళాడు. నా పెద్ద కొడుకు వచ్చి నన్ను నా ఆరోగ్య పరిస్థితి చూసి ఆదుకున్నాడు అని అలాగే ఎవరు లేని రామక్క ను ఆదుకోవడంతో గ్రామస్తులు జడ్పీ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం మండల అధ్యక్షులు సునీల్ కుమార్, తుమ్మ మల్లారెడ్డి, కునూరు మహేష్, గౌడ్, తాహెర్ భాష చంద్రబాబు రామ నరసయ్య, రాజేష్ చందా లక్ష్మీనారాయణ, బొజారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: