మన్యం టీవీ ఏటూరు నాగారం
కన్నాయిగూడెం మండల కేంద్రంలో నిర్మించవలసిన కస్తూరిబా గాంధీ హాస్టల్ ను నా న్ ఏజెన్సీ గ్రామమైన ముప్పన పల్లి గ్రామంలో నిర్మించడానికి గల ఆంతర్యమేటని మంగళవారం తుడుం దెబ్బ కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు గుండ్ల పాపారావు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్నాయిగూడెం మండల కేంద్రానికి కస్తూర్బా గాంధీ హాస్టల్ కేటాయించడం జరిగింది. అప్పటి సబ్ కలెక్టర్ మరియు ఎమ్మార్వో హాస్టల్ నిర్మించుట కొరకు ఏడు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి హాస్టల్ నిర్మించడం కొరకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ కొందరి రాజకీయ లబ్ధి కోసం నాన్ ఏజెన్సీ గ్రామమైన ముప్పన ప ల్లి గ్రామంలో నిర్మిస్తున్నారు. ముప్పన పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న కస్తూరిబా గాంధీ హాస్టల్ అను నిలిపి వేసి ఏజెన్సీ గ్రామమైన కన్నాయిగూడెం మండల కేంద్రంలో నిర్మించాలని, అలాగే జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో తక్షణమే స్పందించాలని తుడుం దెబ్బ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దబ్బగట్ల శ్రీకాంత్, ఆలం జంపయ్య, ఆలం రాంబాబు,చొక్కరావు, లక్ష్మీ నారాయణ,రఘుపతి, మధు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: