మాన్యం టీవీ దుమ్ముగూడెం: మండలం కొత్తదుమ్ముగూడెం గ్రామానికి చెందిన శ్యామల. వెంకటేశ్వర రావు, రమాదేవి దంపతులది ఓ ధీన గాధ వెంకటేశ్వరరావు కు చూపు కనపడదు, భార్య రమాదేవి కి పక్షవాతం వచ్చి కదలలేని స్థితిలో ఉన్నది. సంస్థ భాద్యులు గద్దల కృష్ణ ద్వారా విషయాన్ని తెలుసుకున్న నృసింహ సేవావాహిని బృందం చలించిపోయి గురువారం వారికి నిత్యావసర సరుకులు,25 కేజీలు బియ్యం, హాస్పిటల్ కి వెళ్ళడానికి కొంత ఆర్థిక చేయూతనిచ్చి ఎవరూ లేని ఆ అనాధ దంపతులకు శ్రీ నృసింహ సేవా వాహిని సభ్యులే పెద్దకొడులా ఆదుకున్నారు.కనీసం ఇంటిమీద కప్పులేని ఆ పేద దంపతులు పడుతున్న బాధను చూసి చలించి పోయిన నృసింహ సేవావాహిని సభ్యులు శ్రీధర్ గారు 3500 రూపాయలు విలువ గల టార్పాలిన్ తెచ్చి ఇంటికి కప్పు వేయించి ఆ పేద దంపతులకు అండగా నిలబడ్డారు.ఈ సందర్బంగా నృసింహ సేవావాహిని వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రతి మనిషి లో భగవంతుడు ఉన్నాడని మానవ సేవే మాధవ సేవ అని ధీనులను చేరదీసి ఆదుకోవాల్సిన భాద్యత మనందరిపై ఉన్నదని అన్నారు.స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి వెంకటేశ్వర రావు కుటుంబాన్ని ఆదుకోవాలని,పక్షవా తం వచ్చి కదలలేని స్థితిలో రమాదేవి కళ్ళుకనపడక వెంకటేశ్వరరావు ఇబ్బంది పడుతున్నారని ఇటువంటి వారికి సేవ చేసుకునే మహత్తర అవకాశం మా నృసింహ సేవావాహిని కి దొరికినందుకు సంతోషం గా ఉన్నదని అన్నారు.ఈ కష్టకాలం లో తమను పెద్దకొడులా ఆదుకున్నారని ఆ వృద్ధ దంపతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంత మంచి కార్యక్రమం చేసిన నృసింహ సేవా వాహిని బృందానికి గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సంస్థ వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య, సంస్థ భాద్యులు శ్రీధర్, గద్దల రాజు, నాగరాజు, గద్దల స్వామి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: