మన్యం టీవీ మణుగూరు: డాక్టర్.ఎక్స్ గవర్నర్ బాబూ రావు పుట్టినరోజు సందర్భంగా,మణుగూరు మెయిన్ రోడ్డు మీద చెప్పులు కుట్టు కుంటు జీవితం గడుపుతున్న యాకయ్య కి లయన్స్ క్లబ్ మణుగూరు వారి ఆధ్వర్యంలో రూ.2000 రూపాయల విలువగల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా చార్టర్ ప్రెసిడెంట్ పి.హరిబాబు మాట్లాడుతూ సమాజంలో బీద కుటుంబీకులను వెతికి,వారి వద్దకు వెళ్ళి లయన్స్ క్లబ్ సహాయ, సహకారాలు అందజేస్తున్నారు అని చెప్పారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ గాజుల.పూర్ణ చందర్ రావు,ట్రెజరీ భూక్యా. తార,ప్రెసిడెంట్ నాగేశ్వర రావు,సభ్యులు కృష్ణ మోహన్,బేతం చర్ల వెంకటేశ్వర రావు, కాంతాచారి,మోహన్,, నాగేశ్వరరావు,శ్రీనివాస్, లోకేష్,కురాకుల.శ్రీను,తదితరులు పాల్గొన్నారు,
Post A Comment: