చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
మండల పరిధిలోని రావికంపాడు గ్రామ శివారులో డంపింగ్ యాడ్ పరిసరాల్లో సోమవారం కొంతమంది పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో చండ్రుగొండ ఎస్ఐ బి రాజేష్ కుమార్ తన సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు ద్విచక్ర వాహనాలు 7,200 రూపాయలు నగదును స్వాధీనపరచుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Post A Comment: