మన్యం టీవీ ఏటూరు నాగారం
రాజ్ భవన్ ముట్టడి లో భాగంగా టిపిసిసి పిలుపు ఆదేశాలమేరకు గురువారం ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ రాజ్ భవన్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏటూరు నాగారం మండల పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది మండల అధ్యక్షులుచిటమట రఘు మాట్లాడుతూ దేశ ప్రజల ప్రాథమిక హక్కు ను వ్యక్తిగత గొప్యత కు తూట్లు పొడుస్తూ మోడీ సర్కార్ పెగాసెస్ స్పైవేర్,తో నిఘా పెట్టడం ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు హత్య చేయడమే అని అన్నారు.ఫోన్లు ట్యాపింగ్ చేయడంవల్ల వారి వ్యక్తిగత సమాచారం తెలుసుకుని వాళ్లని మానసికంగా ఇబ్బంది పెట్టాలని,బందీలుగా తన కంట్రోల్లో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని బిజెపి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.ఫోన్ లో ట్యాపింగ్ కింద బిజెపి ప్రభుత్వంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,మండల ఉపాధ్యక్షుడు రియాజ్,సర్పంచ్ ఈసం రామూర్తి,మండల సీతక్క యువసేన అధ్యక్షుడు ఎండి గౌస్, మండల అధికార ప్రతినిధి ఎండీ జిలాని,గద్దల నవీన్, ముస్తాప్, మహేష్, ఉన్నారు.
Post A Comment: