మన్యం టీవీ, అశ్వాపురం:మండల పరిధిలోని మొండికుంట గ్రామ పంచాయతీ లో గురువారం సర్పంచ్ మర్రి మల్లారెడ్డి అద్యక్షతన పల్లె ప్రగతి గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభ లో గ్రామ పంచాయతీ లో పల్లె ప్రగతి లో పది రోజుల పాటు చేపట్టాల్సిన అభివృద్ది పనులపై గ్రామ సభలో చర్చించారు. గ్రామస్తులకు ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పల్లె ప్రగతి లో మొండికుంట గ్రామ పంచాయతీ నీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామ పంచాయతీ గా తీర్చి దిద్దటమే లక్ష్యంగా కృషి చేస్తామని గ్రామ పెద్దలు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుధీర్, ఎంపీటీసీ కమటం నరేష్, పంచాయతీ కార్యదర్శి సైదులు, వార్డ్ సభ్యులు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: