మన్యం టీవీ : జూలూరుపాడు,
జూలై 26, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని ఎల్లంకి గార్డెన్ లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా 419 మందికి ఆహారభద్రత కార్డులు (రేషన్ కార్డ్) లు 28 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, లబ్ధిదారులకు 28 లక్షల 3 వేల 248 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన ఏడు సంవత్సరాల కాలంలోనే అనేక రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సోనీ, వైస్ ఎంపీపీ నిర్మల, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, ఎండిఓ చంద్రశేఖర్, ఎమ్మార్వో లూధర్ విల్సన్, ఎంపీటీసీలు రాజశేఖర్, సతీష్ కుమార్, మధుసూదన్ రావు, సర్పంచులు సావిత్రి, నరసింహారావు, రాములు, రాందాస్, వెంకటలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు చౌడం నరసింహారావు, యదళ్ళపల్లి వీరభద్రం, రామిశెట్టి రాంబాబు, పొన్నెకంటి వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: