మాన్యం మనుగడ దుమ్ముగూడెం: ఉదయం సుమారుగా ఏడు గంటల సమయంలో పర్ణశాల గ్రామ శివారులో గల గోదావరి లో గుర్తుతెలియని మగ వ్యక్తి శవం నీటి ప్రవాహానికి కొట్టుకొని వచ్చి ఉన్నదని సమాచారం రాగా పర్ణశాల వి ఆర్ ఏ అయిన సకినం లక్ష్మి గారు అక్కడికి వెళ్లి చూసేసరికి సుమారుగా 30 -35 మధ్య వయస్సు గల మగ వ్యక్తి శవం ఉన్నదని ,గుర్తు పట్టుటకు వీలు లేకుండా బాగా కుళ్లిన స్థితి లో వుండి, కుడి చేతి పైన అమ్మ అని పచ్చ బొట్టు మరియు ఎడమ చేతిమీద లవ్ అని టాటూ ఉన్నదని తగు చర్య నిమిత్తం పిర్యాదు ఇవ్వగా ఎస్ ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇట్టి గుర్తు తెలియని మగ వ్యక్తి గురించి సమాచారం తెలిసినవాళ్ళు
CI- వేంకటేశ్వర్లు +91 94407 95307,
SI-రవికుమార్ 95024 92722 నంబర్ల కు తెలియజేయగలరని కోరడమైనది.
Post A Comment: