మన్యం టీవీ ఏటూరు నాగారం
మేడారం ట్రస్ట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ ఆలం రామ్మూర్తి ఇటీవలే మరణించినారు. గురువారం అతని దశదిన కర్మకు హాజరైన జడ్పీ ఫ్లోర్ లీడర్ తుమ్మల హరిబాబు మరియు సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన జగ్గారావు,శంకర్,కోటయ్య, మరియు అతని స్నేహితులతో కలిసి మాట్లాడి ఆలం రాంమూర్తి కుటుంబానికి 30000 రూ" ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఆలం రాంమూర్తి వ్యక్తి గతంగా తనకు ఆప్తుడు అని, అతినితో తనకు ఎన్నోఏళ్ల అనుబంధం ఉందని, అతని అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసింది అని,అతని కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సహరించాలి అనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమలు చేపట్టడం జరిగిందని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెరాస నాయకులు కీర్తి రవి, బొల్లం శివ, కొత్తూరు వెంకట్రామయ్య, మువ్వ రామారావు, కొత్తపల్లి ప్రసాదరావు, సిద్దబోయిన సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: