( ఒకరి పరిస్థితి సీరియస్, మరొకరికి స్వల్ప గాయాలు)
మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 18):; అన్నపురెడ్డిపల్లి మండలం, అబ్బుగూడెం గ్రామానికి చెందిన చిలుకూరి వెంకటరెడ్డి, చిలుకూరి సత్యవతి (తల్లి,కొడుకు). కుటుంబ పనుల నిమిత్తం. పెనుబల్లి మండలం, లంకపల్లి గ్రామం నుంచి పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా, అన్నపురెడ్డిపల్లి మండలం, పెద్దరెడ్డిగూడెం(ఏర్రగుంట) గ్రామ పంచాయతీ, బుర్గుగూడెం గ్రామం వద్ద. ఆనంద్ ఖనీలో బొగ్గు దిగుమతి చేసుకోని విఎం బంజర్ వైపు వస్తున్న టిప్పర్ లారీ, అదుపుతప్పి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్ రెడ్డి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కాగా సత్యవతి కు స్వల్ప గాయాలు అయ్యాయని, వెంకట్ రెడ్డి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయగా, వారు ఖమ్మంలోని ఆసుపత్రికి వెళ్లినట్లు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తెలియజేశారు.
Post A Comment: